


శ్రీ పరాశర సంహిత – 3 భాగముల సెట్ (120 పటలములు)
ఏనాటి పరాశర మహర్షి! ఏనాటి పరాశర సంహిత! ఈనాటిదాకా నా దాకా వెలుగు చూడకుండా ఉండటమేమిటి? సుదీర్ఘకాలంగా మహాపండితుల కృషితో వెలువడక అల్పజ్ఞుడయిన నా దాకా ఆగటమేమిటి? కేవలం ఆ హనుమత్స్వామియొక్క కరుణ తప్ప మరేకారణముంటుంది? ఏ జన్మలో చేసికొన్న తపమో ఇలా ఫలించిందని నా భావన. పూజ్య గురుదేవులు శ్రీ పాలపర్తి వేంకట సుబ్బావధానులు గారి రూపంలో స్వామి పూర్వ తపస్సును కొనసాగింపచేసి వారి ఆదేశంతో పరాశరసంహిత కృషికి ప్రేరేపించాడని భావన.
శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవత మెలాగో, శ్రీ హనుమచ్చరిత్రకు ఈ పరాశరసంహిత అలా శరణ్యమైనది. కావున ప్రతిభక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీ గ్రహించాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభనాది విద్యలు, ఒకటననేల సమస్త విషయాలు ఇందులో ఉన్నాయి. శ్రీపరాశర మహర్షి స్వయముగా
“పూజయేత్ పుస్తకం ధన్యః – స మర్త్యో ముక్తిమాన్ భవేత్”
“పుస్తకస్యాపి పూజనం – అపమృత్యుం తరిష్యతి”
అని చెప్పుటవలన హనుమన్ మంత్రశాస్త్రమైన ఈ పరాశరసంహితా గ్రంధాన్ని పూజించుటకూడా హనుమ దనుగ్రహంచే ముక్తి నీయగలదని తెలుపబడింది. కాబట్టి ప్రతి భక్తుడూ ఈ గ్రంధాన్ని పూజాగృహంలో ఉంచుకొనుటద్వారా కూడా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చును.
తన సేవను ఒకరకంగా కాదు. అనేక విధాల చేయించుకొని హనుమత్స్వామి నా జన్మ ధన్యమయ్యేటట్లు చేశాడు. వేలఏండ్లుగా తాళపత్రాలలో వ్రాతప్రతులలో మ్రగ్గుచున్న ఉద్గ్రంధం నాకోసం ఆగి ఉంది. ఒకరిద్ధరు కొంత వెలువరింప యత్నించారు తప్ప కృతకృత్యులు కాలేకపోయారు. అలా నాద్వారానే శ్రీపరాశర సంహిత పూర్తి గ్రంధాన్ని వెలుగులోకి తెచ్చుకొన్నాడు.
ఎందరి సహకారమో లభించుటవలన తప్ప కేవలం ఒక్కడుగా దేనినీ సాధింపలేను. ఎందరి పేర్లని సహాయకులుగా వ్రాయగలను? కాన వ్యక్తి వ్యక్తికీ ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. ఇంతటి ధన్యత ననుగ్రహించిన హనుమత్స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకొంటున్నాను. గ్రంధముద్రణ సహాయకుల ననుగ్రహింప స్వామిని వేడుకొంటున్నాను.
శ్రీ పరాశర సంహిత – ప్రథమ భాగము (1-40 పుటలములు) – మూల్యముః Rs125.00
శ్రీ పరాశర సంహిత – ద్వితీయ భాగము (41-80 పుటలములు) – మూల్యముః Rs125.00
శ్రీ పరాశర సంహిత – తృతీయ భాగము (81-120 పుటలములు) – మూల్యముః Rs125.00
శ్రీ పరాశర సంహిత – పూర్తి 3 భాగముల సెట్ – మూల్యముః Rs375.00
పుస్తకముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ః
శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి, చీరాల – +91-98486 66973
రమేష్ చంద్ర అడివి, హైదరాబాద్ – +91-98492 45355 or Contact me on email here.
ఏక్కద పిన తేలిపిన బుక్స లబిన్చునో తేలుపగలరు సిర్
The books are available in Chirala and Hyderabad. Please contact me on 98492 45355 (Hyderabad) for details
The cost of the books are revised in the new editions.
Each book is Rs 200.00 and total cost of one set (Parts 1,2 and 3) is Rs 600.00.
Ramesh Adivi
Mobile: 984 924 5355
Whatsapp: 770 222 1997